Thursday, September 29, 2011

బంగారు కలలు



యద్దనపూడి నవల " బంగారు కలలు " అధారం గా అన్నపూర్ణావారు 1974 లో నిర్మించిన చిత్రం " బంగారు కలలు " . ఇందులో రవి ( ఏ. నాగేశ్వరరావు ) , సరోజ ( వహీదరెహ్మాన్ ) వీరిద్దరె ముఖ్య పాత్రదారులు . యవ్వనం లో వున్న ఓ అమ్మాయి , ఓ అబ్బాయిని నమ్మి , అతని గురించి పూర్తిగా తెలుసుకోక , అతని తో వెళ్ళిపోతే ఆమె కన్న బంగారుకలలు ఎలా నాశనమవు తాయో చూపటమే ఇందులోని ంఖ్యాంసం . ఎంత చదువుకున్నా , తెలివి కలదైనా అమ్మాయికి నా అనే వారి అండ చాలా ముఖ్యం !
సరోజ పురుషొత్తమ్రావు గారి అండలో పెరుగుతూ వుంటుంది . శేషు మాటలు నమ్మి అతనితో లేచిపోతుంది . కొన్ని రోజుల తరువాత అతని నిజ స్వరూపం తెలుసుకొని ఇంటిలో నుంచి వెళ్ళిపోతుంది . సేవాసదన్ లో చేరి నాట్యం నేర్చుకుంటుంది . హోటల్ లో ప్రదర్షనలు ఇస్తూవుంటుంది . అలా హోటల్ లోనే రవి ఆమెను చూస్తాడు . ఆమె కథ తెలుసుకొని ఆదరిస్తాడు . ఆమె కూతురి కి తండ్రిని అని చెప్పి స్కూల్ లో చేరుస్తాడు . సరోజ ప్రసాద్ దగ్గర నర్స్ గా చేరుతుంది . ఇదంతా రవి ప్రేమించిన జ్యోతి అపార్ధం చేసుకుంటుంది . దుర్వ్యసనాల తో జేల్ కు వెళ్ళిన శేషు , జే నుంచి తిరిగి వచ్చి , సరోజ గురించి తెలుసు కుంటాడు . సరోజను వేదిస్తూ వుండగా చూసిన పురుషోతం అతనిని చంపేస్తాడు . తండ్రి నేరం తన మీద వేసుకొని జేల్ కు వెళుతాడు రవి . కోర్ట్ కు వచ్చి , సరోజ తన కూతురని , ఆ సంగతి లోకం నుంచి దాచానని , రవి కి మాత్రం చెప్పానని , సరోజను శేషు చంప బోతుండగా తనే హత్య చేసానని చెప్పి చనిపోతాడు . రవి , జ్యోతి పెళ్ళి చేసుకుంటారు . సరోజ నర్స్ గానే కొనసాగాలని నిర్ణయించుకుంటుంది .
ఈ సినిమా నిర్మాత డి . మధుసూధన రావు .
దర్శ్కుడు ; ఆదుర్తి . సుబ్బారావు .

సంగీత దర్శ్కుడు ; యస్. వి రాజేస్వర రావు .
గాయనీ గాయకులు ; పి. సుశీల ,
ఘంటసాల,
రామకృష్ణ ,
పిఠాపురం ,
మాధవపెద్ది ,
రఘురాం .

చెక్కిలిమీద కెంపులు మెరిసే చిలకమ్మా


పుట్టిన రోజు జేజేలు చిట్టిపాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి .
ఈ పాట చాలా పాపులర్ ఐంది . ఎవరి పుట్టిన రోజన్నా ఈ పాట ముందు గుర్తొస్తుంది .


సిగారం చిందులు వేసే అమ్మాయిల్లారా
బంగారు కలలే కంటున్నారా ,
ఇది టైటిల్ సాంగ్ . ఈ పాట్ కూడా బాగుంటుంది . వహీదా డాన్స్ కూడా బాగా చేసింది . కాని వహీదా డ్రెస్ , మేకపే అంత నచ్చలేదు నాకు ! అసలు ఈ సినిమా లో వహీదా కొంచ ఏజ్డ్ గా అనిపించింది .


నాలోనా వలపుంది నీ లోనా వయసుంది .
నవల చదివి , సినిమా చూస్తుంటే , సినిమా వూహించినట్లు వుండకుండా నిరాశ కలుగు తోంది . అందుకే ఈ సారి నవల చదవకుండా నే సినిమా చూసాను . రంగులు కొంచం డార్క్ గా వున్నాయి . నాగేశ్వరరావు , వహీదా కొంచం ఏజ్డ్ గా అనిపించారు . అన్నట్లు కాంతారావు ఇందులో నాగేశ్వర రావు మామగారు :) కాని సినిమా పరవాలేదు . ఓకే చూడవచ్చు :)

Friday, September 23, 2011

విచిత్రబంధం



అన్నపూర్ణ వారు 1972 లో , యద్దనపూడి సులోచనారాణి నవల " విజేత " ఆధారం గా తీసిని సినిమా " విచిత్రబంధం" . నవల 1947 లో స్వాతంత్రం వచ్చిన తరువాత , జైల్ లో వున్న స్వాతంత్ర్యసమరయోధులను విడుదలచేయటము తో మొదలవుతుంది . విడుదలైన ఖైదీ , మాధవ్ తనవారిని కలుసుకోవాలని ఆత్రుతతో ఇంటికి జీపు లో వెళుతుండగా దారిలో ఓ కోచ్ బురదలో కూరుకుపోయి కనిపిస్తుంది . దానిని పైకి లేపేందుకు జీప్ డ్రైవర్ తో పాటు మాధవ్ కూడా కోచ్మాన్ కు సాయపడుతాడు . అప్పుడే ఆ కోచ్ లో ప్రయాణిస్తున్న అమ్మాయి తో అనుకోకుండా గొడవ అవుతుంది . ఆ తరువాత మాధవ్ ఇంటికి వెళ్ళటము , అక్కడ తల్లి మరణించింది అని తెలుసుకోవటం , తను ప్రేమించిన సుధ కు పెళ్ళైందని తెలవటం జరుగుతాయి . ఆ విచారం లో వస్తున్న మాధవ్ కు అనుకోని విధం గా ట్రేన్ లో కోచ్ అమ్మాయి కనిపిస్తుంది . ఆ అమ్మాయిని చిలిపిగా ఆటపట్టించటం లో తనమీద అత్యాచారం చేస్తాడు మాధవ్ . జేల్ లో కలిసిన రామగోపాలరావుగారు ఆస్తి మాధవ్ కు వ్రాయటం తో , ఆయనకు పల్లెటూరిలో వున్న ఇల్లు చూద్దామని వచ్చిన మాధవ్ కు ఆ అమ్మాయి , రజాకార్ మూమెంట్ లో తండ్రి చనిపోగా ఆర్ధికం గా చితికిపోయి , తమ్ముడు కుంటివాడై , ఆ పల్లెటూరిలో చిన్న తోటలో కాయగూరలు పండించుకుటూ కనిపిస్తుంది . తన పేరు సంద్య అని తెలుసుతుంది . సంద్య తమ్ముడు వాసు తో స్నేహంగా వుండి , వాసు కాలు బాగు చేయిస్తాడు మాధవ్ . అప్పుడే సంద్య కు బాబు పుట్టినట్లు తెలుస్తుంది . సంద్య కు తప్పని సరై మాధవ్ ఇంట్లో ఆశ్రయం పొందాల్సి వస్తుంది . మాధవ్ బాబు ను ఇంటికి తీసుకొని వస్టాడు . ఇంక ఏముంది , యద్దనపూడి స్టైల్ లో మాధవ్ సంద్య కు దగ్గర ఆయేందుకు ప్రయత్నిచటం , సంధ్య కు కోపం , అష్యం రావటం ఇలా బోలెడు మలుపులు తిరిగి , మాధవ్ సంద్యకు ఓ లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం , ఆ లెటర్ చూడకుండానే సంధ్య కు అసలు విషయం తెలిసి సంధ్య , మాధవ్ లు కలవటం తో నవల ముగుస్తుంది .

1947 తో మొదలు పెడితే ఎవరూ చూడరనుకున్నారో ఏమో , సినిమా కాలేజ్ లైఫ్ తో మొదలవుతుంది . రాజబాబు ( సినిమాలో పేరు ఇందాకే చూసాను కాని మర్చిపోయాను :)) , లవ్ లెటర్ ఇస్తే సంధ్య ( వాణిశ్రీ ) చెంపదెబ్బ కొట్టటమే కాకుండా , ప్రిన్స్ పాల్ కు రిపోర్ట్ చేస్తుంది . చెంపదెబ్బ కొట్టి మరీ సస్పెండ్ చేయించినందుకు మాధవ్( అక్కినేని ) సంధ్య తో రాజబాబు కు సారీ చెప్పిస్తాడు . అది మనసులో పెట్టుకొని మాధవ్ ను ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి తండ్రి తో చివాట్లు పెట్టిస్తుంది . అందుకని సంధ్య మీద కోపం తెచ్చుకొని , ఆమెకు బుద్ది చెప్పాలని మాయోపాయం తో ఆమెను గెస్ట్ హౌస్ కు తీసుకెళ్ళి అత్యాచారం చేస్తాడు మాధవ . కావాలని కాదు పాపం అనుకోని పరిస్తితులలో అనుకోకుండా జరిగిపోతుందన్నమాట ! ఆ తరువాత సంధ్య తండ్రికి ( యస్. వి రంగారావు ) వ్యాపారం లో మేనేజర్ ( గుమ్మడి ) నష్టం వస్తుంది . పైగా సంధ్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది . మానేజర్ , ఆత్మహత్య అనేట్లుగా ఆయనని హత్య చేయిస్తాడు . సంధ్య , తన అత్తయ్య తో , కుంటి తమ్ముడు వాసు తో పల్లెటూరి లో కూరగాయలు పండించుకుంటూ వుంటుంది . ఇక్కడి నుంచి ఇంచుమించు నవల లాగే వుంటుంది సినిమా.

నేను ఇప్పటి వరకు చూసిన అన్నపూర్ణా వారి చిత్రాలలో నాకు నచ్చనిది ఈ సినిమానే ! కాలేజ్ లో వాణిశ్రీ ది , అక్కినేనిది పాత్రల ప్రవర్తన చాలా ఓవర్ గా వుంటుంది . చాలా అతి అనిపించింది . లవ్ లెటర్ ఇవ్వటం తప్పుకాదన్నమాట . దండించటమే తప్పు అన్నట్లుగా మాధవ్ , సంధ్య తో క్షమార్పణ చెప్పించటమూ , దానికి ఆమె కక్షపెట్టుకొని మాధవ్ ను అవమానపరచటము బాగా అనిపించలేదు . అక్కినేని , వాణిశ్రీ ఇద్దరూ చాలా ఏజ్డ్ గా వున్నారు . కాలేజ్ స్టూడెంట్స్ గా అస్సలు బాగాలేరు . ఇహ సెకండ్ ఆఫ్ లో కొంచం పరవాలేదు . సినిమా కొంచం చూడవచ్చు . అదీ కష్టపడి . నాకైతే చాలా బోర్ కొట్టింది .
సెక్రెట్రీ , విచిత్రబంధం చూసాక అక్కినేని ని నవలానాయకుడు అని , వాణిశ్రీ ని నవలానాయిక అని ఎలా అన్నారో అర్ధం కాలేదు . యద్దనపూడి వర్ణనల కూ వాళ్ళకూ ఏమాత్రం పోలిక లేదు . రెండు సినిమాలూ నాకు నచ్చలేదు .
పాటలు పరవాలేదు . ఓమోస్తరుగా వినటానికి వీలుగానే వున్నాయి .
డి. మధుసూధనరావు నిర్మించిన ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు .
సంగీతం; కే. వి . మహదేవన్
సహాయకుడు ; పుహళేంది .
గాయకులు ;
పి. సుశీల ,
ఘంటసాల .
రామకృష్ణ .

వయసే వొక పూల తోట ,
వలపే వొక పూల బాట ,
ఆ తోటలో ఆ బాటలో ,
పాడాలి తీయని పాట.


చిక్కావు చేతిలో చిలకమ్మా ,
నీవు ఎక్కడికీ పోలేవు ఆగవమ్మా !

చీకటి వెలుగుల రంగేళీ ,
జీవితమే ఒక దీపావళి ,
మన జీవితమే ఒక దీపావళి .
అందాలప్రమిదల ఆనందజ్యోతుల
ఆశల వెలిగించు దీపాలవెల్లి .

చీకటివెలుగు రంగేళి ,
జీవితమే ఒక దీపావళి ,
మన జీవితమే ఒక దీపావళి .
చీకటివెలుగుల రంగేళి ,
జీవితమే ఒక దీపావళి ,
ఈ జీవితమే ఒక దీపావళి ,
అందాల ప్రమదల ఆనంద జ్యోతుల ,
అణగార్చి తెలవారు అమవాసరేయి .

భాగ్యనగరం బుర్రకథ

చల్లని బాబూ నా అల్లరి బాబు
నా కంటిపాపవు నీవే మా ఇంటి దీపం నీవే

అమ్మా అమ్మా అని పిలిచావు
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేసావు .
ఏ తల్లి కన్న బాబువో
నా కాళ్ళకు బంధం అయ్యావు .

Saturday, September 17, 2011

అమాయకురాలు


" అమ్మో వాళ్ళా , , , వాళ్ళ ముందు మనమెంత ?మనము చాలా అమాయకులం , అంత తెలివి మనకెక్కడేడ్చింది ." ఇలా అప్పుడప్పుడు కొంత మంది నోట వింటూ వుంటాము . నేనైతే మాటలు విని నవ్వుకుంటాను . ఎవరికి వాళ్ళు తాము చాలా అమాయకులమని , ఎదుటి వాళ్ళు గుండెలు తీసిన బంట్లని అభిప్రాయ పడుతూ వుంటారు :) ఎవరూ అంత అమాయకులేమీ కాదు కదూ ! కాని 1971 లో అన్నపూర్ణా పిక్చర్స్ వారు తీసిన సినిమాలో రాధ మటుకు చాలా అమాయకంగా మోహన్ చేతిలో రెండు సార్లు మోసపోతుంది . అమాయకురాలు సినిమా చూసినప్పుడు రాధ పాత్ర మీద జాలి వేసింది . జమీందారు భూషయ్య గారాల కూతురు రాధ . మేనళ్ళుడి కి ఇచ్చి పెళ్ళి చేయాలని వున్నా , భార్య మాట కాదనలేక వేరే సంబందం చూస్తాడు భూషయ్య. కోర్ట్ పని మీద హైదరాబాద్ వెళుతున్న భూషయ్య తో పాటు వెళుతుంది రాధ . అక్కడే వున్న మోహన్ ను కలుస్తుంది . కోర్ట్ కేస్ లో భూషయ్య ఓడిపోయాడని తెలిసి సంబంధం వదులు కుంటారు మోహన్ వాళ్ళు అప్పటికే గర్భవతి ఐన రాధ ను భూసయ్య మేనల్లుడు ప్రసాద్ పెళ్ళిచేసుకునేందుకు ముందుకు వస్తాడు కాని ప్రసాద్ ప్రేమ కథ తెలిసి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది . లారీ కింద పడిన రాధ ను లారీ డ్రైవర్ రక్షించి తన ఇంట్లో వుంచుకొని కన్నకూతురిలా చూసుకుంటూ వుంటాడు . రాధ కు పాప పుడుతుంది . తన మీద అత్యాచారము చేయబోయిన రౌడీ ని హత్య చేసి జైలు కు వెళుతుంది రాధ . రాధ జాడ తెలుసుకున్న ప్రసాద్ , రాధ పాపను తన స్నేహితురాలి కూతురని చెప్పి తీసుకొచ్చి పెంచుకుంటాడు . క్రమము లో ప్రసాద్ భార్య శోభ ప్రసాడ్ ను రాధ ను అనుమానించటము , లండన్ నుంచి తిరిగి వచ్చిన మోహన్ మళ్ళీ రాధ ను నమ్మించి చంపేయటమూ , సంగతి తెలిసి శోభ నిజం తెలుసుకొని పాపను పెంచి పెద్ద చేయటము జరుగుతుంది .
ఈ సినిమా నిర్మాత ; డి. మధుసూధనరావు
డైరక్టర్ ; వి. మధుసూధన రావు
కథ ; పిని శెట్టి శ్రీరామమూర్తి
సింపుల్ గా నడి చే చక్కని కుటుంబ కథా చిత్రం ఈ సినిమా .ఇందులోని పాటలు కూడా బాగున్నాయి . నాగేశ్వరరావు , కాంచన , శారద ఇందులోని ముఖ్య నటీ నటులు .
సంగీతం ; యస్. రాజేశ్వర రావు ,
నేపద్య గాయనీ గాయకులు ; పి. సుశీల ,
ఘంటసాల , బాలసుబ్రమణ్యం
ఎల్ ఆర్ ఈశ్వరి ,
పిఠాపురం .
పాడెద నీ నామమే గోపాలా ,
ఈ పాట రాధ పెళ్ళిచూపుల్లో పాడుతుంది . నాకు చాలా నచ్చింది .


సన్నజాజిపూవులు చందమామ కాంతులు చిన్నారి పాప నవ్వులు
ఈ పాట ను మా మనవరాళ్ళు , మనవళ్ళ చిన్నప్పుడు , ఎవరికి పాడుతే వాళ్ళ పేరు పెట్టి పాడే దానిని . పిల్లలు ఈ పాటను చాలా ఎంజాయ్ చేసేవారు .


నీ చూపులు గారడి చేసెను


చిరునవ్వుల కులికే రాజా , సిగ్గంతా ఒలికే రాణి


హలొ సారూ భలె వారు , చెలి వలుపుతెలుసుకోరు
పైకెంతో చల్లని వారు తమరెంతో అల్లరి వారు
నా మనసు దోచినారు .
చాలు చాలు సరసాలు
ఇక దూరంగా వుంటే నే మేలు .

కొంటె పిల్లా కోరుకున్న జంట దొరికింది
వంట ఇంటి కుందేలై చేత చిక్కింది .
బ్రహ్మచారీ వంట ఇంటి బాధ తప్పింది
కళ్ళలోనా పెళ్ళి సొగసు గంతులేసింది .

చిన్నారి పైడి బొమ్మా కన్నీరు ఎందుకమ్మా
నీ తల్లి బాధ మరిచి నిదురించవే .