యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన "నల్లంచు తెల్ల చీర " నవల ఆధారముగా , మహేశ్వరీ ఫిలంస్ వారు తీసిన సినిమా " దొంగ మొగుడు " . ఇందులో నాయకుడుగా చిరంజీవి ద్విపాత్రాభినయనంచేయగా , మాధవి , రాధిక , భానుప్రియ నాయికలుగా నటించారు . నిర్మాత ; వెంకన్నబాబు , దర్శకత్వం ; కోదండరామి రెడ్డి . పాటల రచయతలు : కోసరాజు , సీతారామ శాస్త్రి , రాజశ్రీ . గాయనీ గాయకులు ; యస్.పి బాలసుబ్రమణ్యం , పి. సుశీల యస్ . జానకి , యస్.పి శైలజ . సంగీత దర్శకత్వం ; చక్రవర్తి , సహాయకులు ; కృష్ణ , చక్రి . ఈ సినిమా గురించిఅక్కడ చదవండి . కొన్ని పాటలు ఇక్కడ చూడండి :)
1981 లో కె. విశ్వనాథ్ దర్షకత్వం లో వచ్చిన చిత్రము " సప్తపది ". ఈ చిత్రానికి కథ వ్రాసింది కూడా కె. విశ్వనాథ్ నే . మాటలు : జంధ్యాల , నిర్మాత : భీమవరపు బుచ్చిరెడ్డి . " ఆచార వ్యవహారాలన్నవి మనసును సక్రమమైన మార్గం లో పెట్టటానికి తప్ప కులమన్న పేరు తో మనుషులను విడదీయటానికి కాదు ." అన్న సూక్తి మీద తీసినదీ చిత్రము . ఇందులో సోమయాజులు , అల్లు రామలింగయ్య , రమణారావు , కొత్త నటీ నటులు , సబిత , రవికాంత్ , గిరీష్ మొదలైనవారు నటించారు . శంకారభరణం నుంచి సోమయాజులు , అల్లు రామలింగయ్య ల కు ఒకే రకమైన పాత్రలు ఇచ్చినట్లున్నారు కె. విశ్వనాథ్ :) గోదావరిని అందముగా విశ్వనాథ్ చూపించినట్లుగా ఇంకెవరూ చూపించలేరేమో అన్నంత అందం గా వున్నాయి దృష్యాలన్నీనూ . కథ బాగుంది . అన్నీ బాగున్నాయి కాని చిత్రీకరణ నే నాకు అంతగా నచ్చలేదు ! పాటలైతే చాలా చాలా బాగున్నాయి . మరి ఆ పాటలను చూద్దామా :) సంగీతం : కె.వి . మహదేవన్ పాడిన గాయనీ గాయకులు , పి. సుశీల యస్. జానకి , యస్.పి బాలసుబ్రమణ్యం .