Sunday, August 14, 2011

జైజవాన్



అనగనగా ఒక వూరిలో ఒక స్వాతంత్ర్య సమర యోధుడు వుంటాడు . ఆయన కొడుకు రవీంద్ర మిలిటరీ లో చేరి దేశమాత కు సేవ చేస్తూవుంటాడు . ఇంతలో చైనా తో యుద్ధం వస్తుంది . ఆ యుద్ధం లో చనిపోయిన , లేదా కంబడ కుండా పోయిన వారి లో కాప్టెన్ . రవీంద్ర పేరు కూడా వుంటుంది . తండ్రి చెల్లెలు కృఇంగిపోతారు . అక్కడ యుద్దరంగం లో నర్స్ సుశీల ప్రాణాలకు తెగించి కాప్టెన్ . రవీంద్ర ను కాపాడుతుంది . ఇద్దరూ ప్రేమించుకుంటారు . ఇంటి కి తిరిగి వచ్చిన రవీంద్ర వారి పెళ్ళి కొరకు తండ్రి అనుమతి కూడా పొందుతాడు . రవీంద్ర మేనత్త భర్త కు తన కూతురు లక్ష్మిని ఇచ్చి వివాహం చేయాలని వుంటుంది .కాని రవీంద్ర సుశీల ల పెళ్ళికి ముహూర్తము కూడా నిర్ణయింపబడటము తో వారిపై కక్ష పెంచుకుంటాడు . పెళ్ళి షాపింగ్ కని వెళ్ళి తిరిగి వస్తుండగా రవీంద్ర , సుశీల ల కార్ కు ఆక్సిడెంట్ అవుతుంది . సుశీల మరణిస్తుంది . భారతి తను ప్రేమించిన డాక్టర్ రఘు అవిటివాడని తెలుస్తుంది . ఐనా అతనినే పెళ్ళిచేసుకుంటుంది . సుశీల మరణం తో దిగులుగా వున్న రవిని దేశాటనకు తీసుకెళుతారు , రఘు , బారతి . రవి కొంత స్వాంతన చెందుతాడు . వారు బెంగుళూరు లో వుండగా సుశీల లా వున్న అమ్మాయిని టూరిస్ట్ గైడ్ గా చూస్తాడు రవీంద్ర. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించగా , ఆమె సుశీల కవల చెల్లెలు సుజాత అని తెలుస్తుంది . ఆమె తో చనువుగా తిరుగుతాడు . సుజాతను వివాహము చేసుకుంటాననగా సుజాత ఒప్పుకోదు . ఎందుకా అని మధనపడి , విషయము తెలుసుకుందామని సుజాత ఇంటికి వెళుతాడు . అక్కడ సుశీల , సుజాత లను పెంచిన వారిని కలుసుకుంటాడు . వారి అబ్బాయి రఘు తో సుజాత వివాహము , సుజాత తండ్రి చివరి దశలో నిర్ణయిము అవుతుంది . కాని రఘు చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోతాడు . కొన్ని రోజుల తరువాత సుజాత కు ఉత్తరాలు రాస్తూ వుండేవాడు . హఠాత్తుగా ఆ వుత్తరాలూ ఆగిపోతాయి . అతనేమైపోయాడో తెలీదు . కాని సుజాత అతని కొరకే ఎదురుచూస్తూవుంటుంది . రఘు తల్లి తండ్రులు , సుజాత ను రవీంద్ర తో పెళ్ళి కొరకు వొప్పిస్తారు . వారి వివాహం జరిగిపోతుంది . కాని పాకిస్తాన్ తో యుద్దము రావటము వలన వెంటనే రవీంద్ర యుద్దానికి వెళ్ళిపోతాడు . . అప్పుడే భారతి భర్త డాక్టర్ రఘు సుజాత ఇంటికి వస్తాడు . అతను సుజాతను పెంచిన వారి కొడుకని తెలుస్తుంది . రఘుకు ఆక్సిడెంట్ లో కాలు , కన్ను పోయి అవిటివాడు కాగా , మొహం చెల్లక ఇంటికి తిరిగిరాలేదని చెపుతాడు . ఇప్పుడు రవీంద్రతో సుజాత పెళ్ళి జరిగి నందుకు సంతోషించి , ఇంటికి తిరిగి వచ్చానని చెప్పాడు . యుద్దం ముగిసి రవీంద్రా తిరిగి వస్తాడు .

సినిమా దేశ భక్తి తోనూ , ప్రేమ , కొంచం సస్పెన్స్ తో వుంది . ఎక్కడా అతిగా లేకుండా నీట్ గా వుంది . కథ కూడా సాఫీగా సాగిపోతుంది . కాకపోతే రెండు విషయాలు నాకు అర్ధం కాలేదు . ఎలాగూ సుజాతకు రవీంద్ర తో పెళ్ళి జరుగుతోంది . తన పెళ్ళి భారతి తో ఐపోయింది . అలాంటప్పుడు పెళ్ళికే రావచ్చుకదా డాక్టర్ రఘు . పెళ్ళైపోయాక వచ్చి తన కాలూ , కన్నూ తీసి అమ్మ చేతిలో పెట్టే బదులు పెళ్ళికే వస్తే అంతా సంతోషించేవారుగా :)
అలాగే తండ్రి దేశద్రోహులతో కలిసి బ్రిడ్జ్ కూలగొట్టేందుకు ప్రయతిన్స్తున్నాడని లక్ష్మి కి తెలుస్తుంది . రవీంద్ర తండ్రి , లక్ష్మి పరిగెత్తుకుంటూ ఆ బ్రిడ్జ్ దగ్గరకు వస్తారు . లక్ష్మికి దెబ్బ తగులుతుంది . ఆ బ్రిడ్జ్ ను కాపేడేందుకు కాప్టెన్ రవీంద్ర కూడా వచ్చి , బాగా ఫైటింగులు చేసి కాపాడుతాడు . ఇంతకీ ఆ బ్రిడ్జ్ సరిహద్దుల్లో వుందా ? ఆంధ్రప్రదేశ్ లో వుందా ? దేశ సరిహద్దుల్లో వుంటే లక్ష్మి వాళ్ళు అక్కడికి వచ్చారా ? ఆంధ్రప్రదేశ్ లో రవీంద్ర సరిహద్దులు నుంచి అక్కడికి వచ్చాడా ? ఏమో మరి :)

యద్దనపూడి నవల " జై జవాన్ " నవల ఆధారం గా 1970 లో డి . మధుసూధనరావు నిర్మించిన అన్నపూర్ణావారి చిత్రం ఇది . నాగేశ్వర రావు , భారతి , చంద్రకళ , గుమ్మడి , జి . వరలక్ష్మి , నాగభూషణం , సూర్యకాంతం మొదలైనవారు నటించారు .
దర్శ్కత్వం ; డి . యోగానంద్ .

పాటల రచన; కొసరాజు ,దాశరధి , శ్రీశ్రీ , డా . సి నారాయణ రెడ్డి .

మధుర భావాల సుమమాల మన్సులో పూచె ఈ వేళ



వీర భారతీయ పౌరులారా దేశమాత పిలుపు వినలేరా ?

అనురాగపు కన్నులలో నను దాచిన ప్రేయసివే

పాల బుగ్గల చిన్నా దాన్ని పెళ్ళికాని కుర్రదాన్ని


స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు .










1 comment:

Dr.Suryanarayana Vulimiri said...

మాలా కుమార్ గారు, మీకు, మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు.