Saturday, July 9, 2011

వెలుగునీడలు



" వెలుగు నీడలు " అన్నపూర్ణా వారి ఆణి ముత్యములలో వక ముత్యం . ఈ సినిమా నేను కాలేజీ లో వుండగా మారింగ్ షోలో వస్తే మా ఫ్రెండ్స్ అందరూ వళ్ళారు . నాకెందుకో ఈ సినిమా ఏడుగొట్టు సినిమా అన్న భావన వుండటం వల్ల నేను వెళ్ళ లేదు . నేను సినిమా చూసినా , నవల చదివినా చాలా లైట్ , కామిడీ వే చూస్తాను/ చదువుతాను . జీవితమన్నాక కష్టాలూ , కన్నీళ్ళూ తప్పవు అని తెలుసు . అవి సినిమాల్లో కూడా ఎందుకు చూడాలి అని నా ఫీలింగ్ :) సరే అన్నపూర్ణా వారి సినిమాలు చూసి వ్రాయటం మొదలుపెట్టాక ఆ, సీరీస్ లో వెలుగు నీడలు ఏం పాపం చేసుకుంది , దాన్నెందుకు వదిలేయాలి అని , అంతగా ఐతే కళ్ళు మూసుకొని చూద్దాములే అనుకొని ధైర్యం చేసి సి.డి పెట్టాను . కళ్ళు మూసుకునే అవసరం రాలేదు :)) అన్నపూర్ణా వారివి నేను ఇంతకు ముందు చూసిన సినిమ్మాలాగానే బాగుంది . కొంచం ఏడుపు వుందనుకోండి . ఐనా పరవాలేదు చూడవచ్చు .
రావుబహుద్దూర్ వెంకట్రామయ్య ( యస్.వి . రంగారావు ) , కనకదుర్గ ( సూర్యకాంతం ) ల కు పిల్లలు లేకపోతే సుగుణ ( చిన్నప్పుడు , బేబీ శశికళ , పెద్దయ్యాక సావిత్రి ) ని పెంచుకుంటారు . చాలా గారాబం గా చూసుకుంటూ వుంటారు . వెంకట్రామయ్య ప్రెస్ ను నడుపుతుంటాడు . అందులో మేనేజర్ వెంగళప్ప ( రేలంగి ) . ఇంతలో వాళ్ళ కో పాప పుడుతుంది . దాని తో అప్పటివరకు గారాబంగా చూసుకుంటున్న సుగుణ అంటే కనక దుర్గ కు సుగుణ మీద ఆపేక్ష పోయి , ఇంటి నుంచి వెళ్ళ గొడుదామనుకుంటుంది . అందుకని వెంకట్రామయ్య సుగుణను వెంగళ్ళప్పకు అప్పగిస్తాడు . సుగుణ పెద్దదై డాక్టర్ అవుతుంది . చదువుకునే రోజులలో పరిచయమైన చంద్రం ను ప్రేమిస్తుంది . కనకదుర్గ కూతురు వరలక్ష్మి ( గిరిజ ) కు చదువు అబ్బదు . సుగుణ ట్యూషన్ చెబుతున్న అబ్బాయి మేనమామ డాక్టర్ . రఘు ( జగ్గయ్య ) సుగుణ ను పెళ్ళి చేసుకుందామనుకుంటాడు . చంద్రం కు టి. బి అని తెలుస్తుంది . రఘు ను పెళ్ళిచేసుకోమని సుగుణ ను వొప్పించి , ఇద్దరికీ పెళ్ళి జరిపించి , ఆదర్శ డాక్టర్లు గాను , ఆదర్శ దంపతులుగాను జీవించమని , దీవించి , మదనపల్లి సానిటోరియం లో చేరుతాడు . కాలక్రమేణ చంద్రం జబ్బు నయమై , ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తాడు . చంద్రం ను రిసీవ్ చేసు కునేందుకు వెళుతున్న రఘు కు ఆక్సిడెంటై చనిపోతాడు . సుగుణ పేదలకు వైద్యం చేస్తూ జీవించేందుకు నిశ్చయించుకుంటుంది . చంద్రం ను వొప్పించి వరలక్ష్మి తో వివాహం జరిపిస్తుంది . వారికి ఒక బాబు పుడతాడు . చంద్రం కు వెంకట్రామయ్య ప్రెస్ ను అప్పగిస్తాడు . చద్రం ప్రెస్ ను అభివృద్ధి లోకి తెస్తాడు . తల్లి భోధనల తో చంద్రం ను , సుగుణ ను అనుమానిస్తుంది .చంద్రం కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు . చివరకు వరలక్ష్మి నిజం తెలుసు కుంటుంది . అందరూ కలిసి హాపీగా వుంటారు .
నటీ నటులందరూ యధావిధిగా బాగా నటించారు . రఘు చనిపోయాడని తెలుసుకున్నప్పుడు " నిన్ను వెలుగు లోకి పంపుతున్నానని శాశ్వ్తంగా చీకటిలోకి పంపాను . ఈ నేరం నాది సుగుణా నాది " అంటూ చంద్రం నుదుటి మీద గుప్పిట పెట్టుకొని నాగేశ్వరరావు మార్క్ డైలాగ్ చెప్పుతాడు :) అమ్మో కనక దుర్గమ్మ నోరే నోరు . బాబోయ్ ఇలాంటి నొరున్నవాళ్ళను తట్టుకోవటం కష్టమే :) సినిమా చివరలో బుడ్డోడు , చిన్న రఘు ( చంద్రం , వరలక్ష్మి ల కొడుకు ) సుగుణ దగ్గరకు తన మూడు చక్రాల సైకిల్ వేసుకొని రయ్ రయ్ మని , బండి కిందనుంచి కార్ ల పక్కనుంచి భలే వెళుతాడు :) ఇందులో కమల్ హాసన్ చిన్నప్పుడు ఏదో వేషం వేసాడని ఎక్కడో చదివిన గుర్తు . ఎక్కడా అని వెతికాను కాని తెలుసుకోలేక పోయాను . మొత్తానికి సినిమా చూడవచ్చు .
పాటలలో " పాడవోయి భారతీయుడా " ఇప్పటికీ స్వాతంత్ర దినోత్సవం రోజున వినిపిస్తూనే వుంటుంది . ఈ పాటలో చెప్పిన ధరలు , నిరుద్యోగం , చీకటి బజారు లాంటి వాటికి ఇప్పుడూ మోక్షం కలుగలేదు .
" కలకానిది విలువైనది , బ్రతుకు కన్నీటి ధారలలో బలి చేయకు " ,
" హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి తారాలల్లే మందుజల్లి నవ్వాసాగే ,"
"పాడవోయి భారతీయుడా "
" శివ గోవింద గోవింద " ,
"చల్లని వెన్నెల సోనలు , తెల్లని మల్లేల మాలలు , మాపాపాయి బోసి నవ్వులే మంచి ముత్యముల మాలలూ " ,
" చిట్టీ పొట్టీ చిన్నారీ పుట్టిన రోజూ , చేరి మనం ఆడీ పాడే పండగ రోజు "
హిట్ సాంగ్స్ . వీటిని శ్రీశ్రీ , కొసరాజు రాసారు .
సంగీత దర్శకుడు ; పెండ్యాల .
గాయనీ గాయకులు ;
పి. సుశీల , ఘంటసాల , జిక్కీ , స్వర్ణలత , మాధవపెద్ది సత్యం .
పాటలు;

పాడవోయి బారతీయుడా , ఆడి పాడవోయి విజయగీతికా



కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు



చిట్టీ పొట్టీ చిన్నారి పుట్టిన రోజు చేరి మనం ఆడి పాడే పండుగ రోజు



చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు



హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందుజల్లి నవ్వసాగే ఎందుకో




శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద


ఓ రంగయ్యో పూల రంగయ్యో ఓర చూపు చాలించి సాగిపోవయ్యో

No comments: