Tuesday, July 19, 2011

ఆత్మ గౌరవం




అన్నపూర్ణా వారు 1965 లో కె .విశ్వనాథ్ దర్శకత్వం లో నిర్మించిన చిత్రం " ఆత్మ గౌరవం " . అప్పటి వరకు అన్నపూర్ణా వారి సినిమాలలో అసిస్టెంట్ డైరక్టర్ గా కనిపంచిన కె.విశ్వనాథ్ పేరు ఈ సినిమాలో డైరెక్టర్ గా కనిపించింది .మరి ఆయన డరెక్ట్ చేసిన మొదటి సినిమా ఇదేనేమో నాకు తెలియదు :)ఈ సినిమా నిర్మాత డి . మధుసూధన రావు . హీరో ఇంకెవరు ? నాగేశ్వర రావే ! హీరోయిన్ మటుకు కాంచన . ఇంకో హీరోయిన్ రాజశ్రీ . సరే రేలంగి , రమణారెడ్డి , సూర్యకాంతం , అల్లురామలింగయ్య వుండనే వున్నారు . అన్నట్లు చలం కూడా వున్నాడు . మ్య్యుజిక్ డైరెక్టర్ సాళ్ళూరి రాజేశ్వర రావు . పాడింది , ఘంటసాల , పి. సుశీల , వసంత .
కథ విషయానికోస్తే :- జమీందార్ గారికి పిల్లలు లేరు . అందుకని వారి సతీమణి సంతాన లక్ష్మి తన చెల్లెలి కొడుకు వేణు ను పెంచుకుందామనుకుంటుంది . కాని జమీందార్ గారికి ఇష్టం వుండదు . వూరిలోని పొలాలు చూసుకోవటానికి వెళ్ళిన జమీందారు గారికి , ఆ పొలం కౌలుదారు రామయ్య తమ్ముడు శ్రీనివాస రావు చురుకుదనం చూసి ముచ్చటపడి దత్తత తీసుకుంటాడు . వాసు కు తోడుగా వేణు ను కూడా తెచ్చుకుంటారు . ఇద్దరినీ పట్నం లో వుంచి చదివిస్తారు . అక్కడ భజగోవిందం ( జమీందారు గారి ఫ్రెండ్ ) ఆయన కూతురు గీతను , వాసు కు ఇచ్చి పెళ్ళి జరిపిద్దామనుకుంటాడు . దానికి జమీందరు , సంతాన లక్ష్మి కూడా ఇష్టపడుతారు . వాసు మేనకోడలు సావిత్రి ని వాసుకు ఇచ్చి పెళ్ళి జరిపించాలని రామయ్య , అతని తల్లి పిల్లల చిన్నప్పటి నుంచే అనుకుంటారు . ఆ మాట వాసు ను దత్తుకు ఇచ్చే ముందే చెపుతారు . కాని జమీందారు భార్య వత్తిడి వల్లనూ , వాసు గీత ను ప్రేమిస్తున్నాడని పొరబడటం వల్లనూ సావిత్రి ని కోడలిగా చేసుకునేందుకు ఇష్టపడడు . రామయ్య భార్య పురిటిలో పిల్ల తో సహా చనిపోతుంది . ఎలాగు వాసు పెళ్ళి జరిగిపోతోంది కాబట్టి సావిత్రి కి వేరే సంబంధం ఖాయపరిచి ,ఆ సంభంధం కుదరాలంటే వారి పిచ్చి అమ్మాయిని రామయ్య పెళ్ళి చేసుకోవాలని షరుతు మీద ఆ పిచ్చి పిల్లను పెళ్ళి చేసుకుంటాడు . కాని అతని త్యాగాన్ని వేస్ట్ చేస్తు సావిత్రి చచ్చిపోతున్నానని ఉత్తరం రాసిపెట్టి , ఇంట్లోనుంచి వెళ్ళిపోతుంది . హూం . . . ఆ తరువాత సావిత్రి , గీత కార్ కింద పడటం , గీత ఆమెను రక్షించి సేవాసదనం లో చేర్చటం , గీత ఇంట్లో సావిత్రి ని చూసిన వాసు ఆమెను ప్రేమించటం , గీత సరళను అదేనండి సావిత్రి ని అపార్ధం చేసుకోవటం , వాసుకు నిజం చెప్పటం , మాయ మాట ల తో సావిత్రి ని వాసు ఇంట్లో చేర్చటం , జమీందార్ అండ్ కో ఆమెను గీత అని పొరబడటం , పెళ్ళి ఏర్పాట్లు చేయటం , ఆపైన నిజం తెలుసుకొని సావిత్రి ఇంట్లో నుంచి వెళ్ళ గొట్టటం అబ్బో ఇంకా చాలా కథ జరుగుతుంది .

సినిమా లో పాటలు పరవాలేదు బాగానే వున్నాయి . నటీ నటులూ బాగానే వున్నారు . కాని . . . . కథే మరీ . . . సాగతీతగా అనిపించింది . ఎంతసేపటికీ అవదు :) సావిత్రి రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం , సంతానలక్ష్మి చివరలో ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం పాపం . . . ప్రేక్షకుల అదృష్టం వల్ల వాళ్ళు బతికిపోయారు :) " బీదవారికి ధనం లేకపోయినా ఆత్మ గౌరవం వుంటుంది " అని రామయ్య తో ఓసారి , వాసుతో రెండు సార్లు అనిపించి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు :)
ఇంకా సినిమా గురించి ఏమి చెప్తాను కాని పాటలు వినేస్తే సరి ;

అందెను నేడే అందని జాబిల్లీ ,
రానని రాలేనని వూరకె అంటావు ,
ఒక పూల బాణం తగిలింది మదిలో



మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు మాఇంటి కోచ్చారు




ప్రేమించి పెళ్ళి చేసుకో



ప్రేమించనిదే పెళ్ళాడనని తెగ కోతలు కోసావులే

2 comments:

తృష్ణ said...

అవునండి ఇది విశ్వనాథ్ గారు దర్శకత్వం చేసిన మొదటి సినిమా.బావుంటుంది.

మాలా కుమార్ said...

తృష్ణగారు ,
విశ్వనాథ్ గారు దర్శకత్వం చేసిన మొదటి సినిమా ఇదేనని ఎక్కడో చదివానండి . కాని సరిగ్గా గుర్తులేక కాస్త అనుమానం గా రాసాను :) మీరు కంఫర్మ్ చేసినందుకు థాంక్స్ అండి .